శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు - ఉపోద్ఘాతం(Introduction Part 02)

శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు ఉపోద్ఘాతం(Introduction Part 02) కి॥ శే॥ శ్రీ పోతరాజ నరసింహం పంతులుగారు 13-10-1883 రాత్రి గం॥ 12-20 ని॥లకు జన్మించారు. బాల్యంలోనే తల్లిని ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తండ్రినీ పోగొట్టుకొని, వారి మేనత్తగారి పోషణలో పెరిగారు. స్కూలు ఫైనలు వరకు విశాఖపట్టణంలోను ఆ తర్వాత M.A. వరకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదివేరు. తర్వాత ఎడ్యుకేషనల్ సర్వీసులో (M.ES.) చేరి ఫిలాసఫీ ప్రొఫెసరుగా, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను, కుంభకోణము ప్రభుత్వ కళాశాలలోను పనిచేసి రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాలుగా రిటైరైనారు. శ్రీ P.N. (శ్రీ నరసింహం పంతులుగారిని ఈ యోగసాధకులందరు శ్రీ పి. యన్. అని పిలవడం అలవాటు) 1913-1914 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేస్తుండేవారు అప్పుడు వారు థియోసాఫికల్ సొసైటీ మెంబరుగా ఉంటూ వారి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు. అప్పట్లో ఆ సంఘ సభ్యులందరు నమ్ముతూ వస్తున్న కొన్ని విషయాలు వమ్ము(తప్పులని నిరూపించబడడం) అయిపోయిన కారణంగా వారి కార్యకలాపాలలో నమ్మకము పోయి, మత విషయాలలో మానవుల నమ్మకాల మీద వారికి ద్...